జవహర్నగర్, నవంబర్ 15: విజ్ఞానం ముందు వైకల్యం అడ్డురాదని, దేశంలోని అన్ని రంగాల్లో దివ్యాంగ మహిళలు సకలాంగులతో పోటీపడుతూ రాణిస్తున్నారని, పోటీ ప్రపంచంలోని సాంకేతికను అందిపుచ్చుకోవాలని ఢిల్లీలోని అంబేద్కర్ విశ్వవిద్యాయం ప్రొఫెసర్ అనితాఘాయ్ పిలుపునిచ్చారు. మంగళవారం కార్పొరేషన్లోని బిట్స్ పిలానీలో దివ్యాంగుల హక్కులకై జాతీయ మహిళా సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సుందర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ప్రపంచం ఐటీని అనుసరిస్తుందని, దివ్యాంగ మహిళలు నైపుణ్యం పెంచుకొని అందరికి ఆదర్శంగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూడీఎస్ ఢిల్లీ ప్రొఫెసర్ రేణు అడ్లాఖా, ఐడీఎస్కే నందనీఘోష్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఘవరెడ్డి, నల్సార్ ప్రొఫెసర్ అమితదండా, టీఐఎస్ఎస్ ముంబై డాక్టర్ బిందులక్ష్మి, ఐఐటీ హైదరాబాద్ శుభ రంగనాథన్, దేశంలోని వివిధ ప్రాంతాల్లో లింగ, వైకల్యంపై పనిచేసే పండితులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.