బడంగ్పేట, సెప్టెంబర్ 18: విద్యార్థులు కష్ట పడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ హుస్సేన్ అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డేకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో కొత్త కోర్సులు రావడం జరిగిందన్నారు. వాటికి అనుగుణంగా విద్యార్థులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులు కష్ట పడి చదువుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పెరుగుతున్న పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులు చదువుకోవాలన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మంచి ప్లేస్ మెంట్లు వస్తున్నాయని అన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థులపై ఆధార పడి ఉందన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి తీగల హరినాథ్ రెడ్డి, కోశాధికారి తీగల అమర్ నాథ్ రెడ్డి, ఏవో నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ డి.రవిశంకర్, మురళీ మోహన్, హెచ్ఓడీలు, అధ్యాపాకులు పాల్గొన్నారు.