హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్/కవాడిగూడ: హైదరాబాద్లో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పీవీ మార్గ్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్ బుధవారం పరిశీలించారు. అనంతరం ట్యాంక్బండ్పై ఉన్న అంబేదర్ విగ్రహం నుంచి ఇందిరాపారు మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు వెళ్లారు. వజ్రోత్సవాల్లో భాగంగా 17న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేదర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ జరుగనున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటన అనంతరం మంత్రులు తలసాని, సత్యవతి రాథోడ్, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి శ్రీనివాస్గౌడ్ కార్యాలయంలో వజ్రోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనున్న సభలో తెలంగాణ సాంసృతిక కళా వైభవాన్ని చాటేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సాంసృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణను ఆదేశించారు. ఆదివాసీ భవన్, బంజారా భవన్ ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన సాంసృతిక కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. ఆదివాసీ భవన్ ప్రారంభం తర్వాత గిరిజనులు ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియంకు వస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, రసమయి బాలకిషన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్ర నాయక్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.