చర్లపల్లి, ఆగస్టు 7 : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ మార్కెట్, కుషాయిగూడ రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొని..అమ్మవారికి పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బోనాల సందర్భంగా ఆలయాలకు ప్రత్యేక నిధులు సీఎం కేటాయించారని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గపరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, కుషాయిగూడ రజక సంఘం అధ్యక్షుడు, వెంకటేశ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్, ప్రతినిధులు బాల్రాజు, శ్రీనివాస్, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు కాసం మహిపాల్రెడ్డి, డప్పు గిరిబాబు, మర్కెట్ కమిటీ చైర్మన్ నందగిరి లక్ష్మీనారాయణ, ఐతే రమేశ్, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, సారా అనిల్, గంప కృష్ణ, వినోద్, వెంకటేశ్, చంద్రమౌళి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఛేఅలాగే..చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, తదితరులు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అం జయ్య, నిర్వాహకులు వెంకటేశ్, ప్రభాకర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రమేశ్, నాయకులు నా గిళ్ల బాల్రెడ్డి, విద్యాసాగర్, కనకరాజుగౌడ్, రాజేశ్వర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బత్తుల శ్రీకాంత్యాదవ్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.