ఘట్కేసర్, జూలై 4 : ప్లాస్టిక్తో వచ్చే అనర్థాలను ప్రజలు గుర్తించి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ అన్నారు. సోమవారం కమిషనర్ వసంతతో కలిసి ఘట్కేసర్లో పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ అధికారులు ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ భూమిలో కరిగిపోకుండా పర్యావరణానికి నష్టం చేస్తుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిందని చెప్పారు. మున్సిపాలిటీల్లో దుకాణాదారులు ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తే భారీ జరిమానా వేయనున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేద్దాం
మేడ్చల్ రూరల్, జూలై 4 : ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ప్లాస్టిక్ నిషేధంపై గుండ్లపోచంపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బజారుకు వెళ్లేటప్పుడు నార సంచులు తీసుకెళ్లాలని, ప్లాస్టిక్ బ్యాగులకు దూరంగా ఉండాలన్నారు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్, కౌన్సిలర్లు బాలరాజు, వీణాసురేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఈఈ నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.