సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ)/చార్మినార్: లాల్ దర్వాజలో సింహవాహిని అయిన శ్రీ మహంకాళి అమ్మవారు అచ్చెరువొందేలా పాత నగరంలో బోనాలు నిర్వహించేందుకు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ నెల 24న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సాలార్జంగ్ మ్యూజియంలో సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం బోనాల నిర్వహణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామని వివరించారు. ఓల్డ్ సిటీ బోనాల సందర్భంగా చేపట్టిన పనులు ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయాల పరిధిలో ఎకడ కూడా సీవరేజ్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. అంబారీపై ఊరేగింపు ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఈ ఊరేగింపు సందర్భంగా ఎకడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ తీగలను సరిచేయడం వంటి పనులు వెంటనే చేపట్టాలని చెప్పారు.
భక్తులకు అందించేందుకు వాటర్ వర్స్ ఆధ్వర్యంలో 2 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేరొన్నారు. భక్తులు ఉత్సవాలను వీక్షించే విధంగా పలు ఆలయాల వద్ద ఎల్ఈడీ స్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. అవసరమైన ప్రాంతాలలో డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ, జోనల్ కమిషనర్లు సామ్రాట్ అశోక్, రవి కిరణ్, ఎలక్ట్రికల్ సీజీఎం నర్సింహ స్వామి, స్ట్రీట్ లైట్ ఎస్ఈ నర్సింగ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ ఆనంద్, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్స్ ఈఎన్సీ కృష్ణ, సీజీఎం వినోద్ భార్గవ, ఆర్టీసీ డీవీఎం రాములు, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్, జూ పారు క్యూరేటర్ రాజశేఖర్, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ యాదవ్, జనరల్ సెక్రటరీ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.