మేడ్చల్ రూరల్, జూన్ 28: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి మంగళవారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్కెలగూడ, కండ్లకోయ, సుతారిగూడలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు సొంత నిధులతో సమకూర్చిన నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దాతలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని, ఉన్నతంగా చదవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించడం శుభపరిణామం అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, మేడ్చల్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరహరి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీలతాశ్రీనివాస్ రెడ్డి, రజితావెంకటేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కొల్తూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో….
శామీర్పేట, జూన్ 28: లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ చావా సత్యనారాయణ జన్మదినం సందర్భంగా మంగళవారం మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, క్రీడాసామాగ్రిని ఉచితంగా లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ రమణారావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శిల్పయాదగిరి, ఉపసర్పంచ్ పి.జైపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ ఏ.భాగ్యమణి, విద్యా కమిటీ చైర్మన్ బాలనర్సింహ, డీవీఎల్ నర్సింహారావు, శ్రీకాంత్, ఏఎస్ఆర్.మూర్తి, శివలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.