మారిన రింగ్రోడ్డు చౌరస్తా రూపురేఖలు
ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం
ఎల్బీనగర్, జూన్ 27: ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ ఎడమ వైపు ఫ్లై ఓవర్ను రూ.33.42కోట్లతో 780 మీటర్లు నిర్మించి ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా నగరం నుంచి వనస్థలిపురం వైపునకు ఎల్బీనగర్ రింగ్రోడ్డు చౌరస్తా మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. అదే విధంగా.. ఎల్బీనగర్ రింగ్రోడ్డు చౌరస్తాలో రోడ్డు కింది భాగంలో ఎల్బీనగర్ కుడివైపు అండర్ పాస్ను రూ.39.29 కోట్లతో 520 మీటర్లు నిర్మాణం చేయగా, ఎల్బీనగర్ ఎడమవైపు అండర్ పాస్ రూ.14.87కోట్లతో 520 మీటర్లు నిర్మాణం చేసి అందుబాటులోకి వచ్చారు. దీంతో ఇన్నర్ రింగ్రోడ్డులో ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఇరువైపులా అండర్పాస్ల ద్వారా ప్రయాణం సాగుతోంది. ఇక ఎల్బీనగర్ జంక్షన్లో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనదారుల కోసం మరో ఫ్లై ఓవర్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఎల్బీనగర్ జంక్షన్లో రైట్ సైడ్ ఫ్లై ఓవర్ రూ. 26.56 కోట్లతో సుమారు 780 మీటర్ల పొడవునా నిర్మాణ పనులు సాగుతున్నాయి.
ఎల్బీనగర్ చౌరస్తాకు నూతన హంగులకు సమకూరాయి. నాడు రింగ్రోడ్డు చౌరస్తాగా పేరున్న ఎల్బీనగర్ చౌరస్తా.. నేడు అద్భుతమైన హంగులతో ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా ఎల్బీనగర్ చౌరస్తాకు కొత్త అందాలు సమకూరాయి. మంత్రి కేటీఆర్ సహకారం, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రత్యేక చొరవతో ఎస్ఎన్డీపీ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ చిక్కులతో ఇన్నర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ పథకం కింద చేపట్టిన పనులతో ఎల్బీనగర్కి సరికొత్త అందాలు సమకూరుతున్నాయి. ఫ్లై ఓవర్లు, అండర్పాస్తో పాటు ఎల్బీనగర్కు మణిహారంగా మెట్రో రైలు ప్రాజెక్ట్తో మరింత శోభ చేకూరింది. జాతీయ రహదారిపై పైలట్ ప్రాజెక్ట్ కింద ఎల్బీనగర్ రింగ్రోడ్డు నుంచి చింతలకుంట చెక్పోస్టు వరకు అధునాతన రోడ్డు నిర్మాణం పనులు పూర్తయ్యాయి.
ఎల్బీనగర్ రింగ్రోడ్డు నుంచి చింతలకుంట వరకు..
ఎల్బీనగర్ రింగ్రోడ్డు చౌరస్తా నుంచి చింతలకుంట చెక్పోస్టు వరకు రూ. 2.50 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి, సర్వీస్రోడ్లు, రోడ్డు చివరి ప్రాంతాలను సర్వాంగ సుందరంగా పచ్చదనంతో రోడ్డు డివైడర్లు, ఫుట్పాత్లు, అందమైన మొక్కలతో తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా సర్వీస్ రోడ్డు జాతీయ రహదారి పక్కనే సైక్లింగ్ ట్రాక్, ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యాలు, ల్యాప్టాప్, ఫోన్, కార్ల చార్జింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్తో జాతీయ రహదారి పచ్చని చెట్లతో సుందరమైన రహదారులతో విదేశీ హంగులు సమకూరుతాయి.
మెట్రో రైలు హంగులు కూడా..
మెట్రో రైలు పేరు చెప్పగానే ఎల్బీనగర్ గుర్తుకు వస్తుంది. ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఇరువైపులా మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. మెట్రో మణిహారంతో ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరింది. గ్రేటర్ నగరంలో తూర్పు ప్రాంతానికి, పడమర ప్రాంతానికి మెట్రోతో తేలిగ్గా ప్రయాణం చేసే అవకాశం దక్కింది.
ఎల్బీనగర్ చౌరస్తాకు అంతర్జాతీయ హంగులు
ఎల్బీనగర్ చౌరస్తాలో అంతర్జాతీయ హంగులు సమకూరుతున్నాయి. అండర్పాస్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలతో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం సాగుతోంది. నగరానికి వచ్చే మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఇక ఎల్బీనగర్ చౌరస్తా వద్ద వాహనాల రద్దీ పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాక చింతలకుంట చౌరస్తా వరకు జాతీయ రహదారిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. భవిష్యత్తులో ఎల్బీనగర్ను అన్ని విధాలుగా అద్బుతంగా తీర్చిదిద్దుతాం. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్ను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్నాం.
– ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి