బేగంపేట్, జూన్ 26: విష పదార్థాలు తీసుకోవడం.. విష పురుగులు కుట్టడం లాంటి వల్ల ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా వందకు 64 విష ప్రభావం కేసులు వస్తున్నాయి. అయితే, విషాన్ని ఎలా తీసుకున్నా.. మొదటి అరగంట లోపే తగిన వైద్యం అందిస్తే వారిలో చాలామంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ అంశంపై తెలుగు రాష్ర్టాల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆదివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఇంటర్నల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో టాక్సికాన్ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సు ప్రాధాన్యత గురించి కిమ్స్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వి.జగదీశ్ కుమార్ మాట్లాడారు.. విష పదార్థాలు తీసుకున్న పేషంట్కు మొదటి అరగంట గోల్డెన్స్ అవర్గా పేర్కొన్నారు. వైద్యంపై తెలుగు రాష్ట్రాల్లోని వైద్యులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తొలిసారిగా కిమ్స్ ఆస్పత్రిలో టాక్సికాన్ 2022 పేరుతో సదస్సును నిర్వహించినట్టు తెలిపారు. ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు నార్కోటిక్ విభాగం డీసీపీ జి.చక్రవర్తి ముఖ్య అతిథులుగా ఆర్గనైజింగ్ చైర్ పర్సన్గా కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ భాస్కర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి.జగదీశ్ కుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు.