ఎల్బీనగర్, జూన్ 26: లింగోజిగూడ డివిజన్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కాకతీయనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావుతో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను రాజకీయాలకు అతీతంగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీప్రసన్న, మాజీ అధ్యక్షుడు తిలక్రావు, సీనియర్ నాయకులు జగన్నాథ్రెడ్డి, నర్సింహ గుప్త, నర్రె శ్రీనివాస్, శ్రీధర్ గౌడ్, రాకేశ్ టాగోర్, శ్రీకాంత్, శ్రీధర్, సరళ, కాలనీ అధ్యక్షుడు రఘుపతి, జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.