మియాపూర్ , జూన్ 24 : లక్షలాది రూపాయాలు వెచ్చించే అవసరం లేకుండా.. నామమాత్రపు ధరలతో సకల హంగులతో శుభకార్యాలు ఇతర వేడుకలను నిర్వహించుకునేందుకు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసి త్వరలో హాల్ను కేటీఆర్ చేతుల మీ దుగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్టలో రూ. 6.50 కోట్ల నిధులతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్ పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాలమైన హాల్.. భారీ వేదిక.. సౌకర్యవంతమైన గదు లు.. పార్కింగ్ వసతులో నిర్మిస్తున్నట్లు, ఇప్పటికే సింహభాగం పనులు పూర్తయ్యాయని అన్నారు. పెండింగ్ పనులను సైతం పూర్తి చేసి త్వరలో ఈ వేదికను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ రాజీవ్, మహదేవ్, పార్టీ నేతలు శ్రీనివాస్, ఇబ్రహీం, వేణు, మనోహర్, నరేంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ పరిధిలోని మోర్ సూపర్ మార్కెట్ నుంచి సమతానగర్ వరకు నిర్మించనున్న లింక్ రోడ్డు పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ గాంధీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సౌక ర్యం కోసం కీలకమైన ఈ లింక్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. దీని వల్ల జాతీయ రహదారిపై కొంత మేర ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. ఈ ఈ గోవర్ధన్, ఏఈ రాజీవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్తో కలిసి విప్ గాంధీ తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేశ్, మా జీ కార్పొరేటర్లు రంగారావు, రవీందర్, పార్టీ నేతలు రాజునాయక్, సమ్మారెడ్డి, ఆదర్శ్రెడ్డి, చంద్రకాంత్రావు, కాశీనాథ్, రవీందర్, మోజెస్, కృష్ణ, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీ డివిజన్ మహంకాళీనగర్ నివాసి షేక్ లలన్కు అత్యవసర శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 3 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను విప్ గాంధీ శుక్రవారం తన నివాసంలో లబ్ధిదారుకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి బాధితులకు కొండంత భరోసాగా నిలుస్తున్నదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు విప్ తెలిపారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్, సలీం, చాంద్ పాల్గొన్నారు.