3 నుంచి క్రికెట్ టోర్నమెంట్
విజేత జట్టుకు రూ. 2 లక్షల నగదు బహుమతి
జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బంజారాహిల్స్, జూన్ 24: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూలై 3వ తేదీ నుంచి 23వ తేదీ దా కా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనా థ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడారు. ప్రతిభ కలిగిన యువతను గుర్తించడంతో పాటు వారికి ప్రోత్సాహకం కల్పించేందుకు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను అవకాశంగా తీసుకుని ప్రతియేటా భారీ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ని ఏడు డివిజన్లకు చెందిన క్రీడాకారులు పాల్గొనేలా టోర్నమెంట్ను నిర్వహిస్తామన్నారు.
జూలై 3నుంచి 10 దాకా బస్తీలు, కాలనీల నుంచి జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయని, ఒక్కో డివిజన్ నుంచి 2జట్లు ఫైనల్ రౌండ్కు చేరుకుంటాయన్నారు. ఫైనల్ రౌండ్లో 14జట్లు పోటీపడతాయని జూలై 16 నుంచి ఫైనల్ రౌండ్ పోటీలు ఉంటాయని, జూలై 23న ఫైనల్స్ ఉంటాయన్నారు. నాకౌ ట్ పద్ధతిలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతి. రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.1 లక్ష నగదు బహుమతి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతా యాదవ్, దేదీప్యారావు, రాజ్ కుమార్ పటేల్తో పాటు అన్ని డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్కు సంబంధించిన గోడ పత్రికలను ఎమ్మెల్యే మాగంటి ఆవిష్కరించారు.