ఎల్బీనగర్, జూన్ 24: వరదనీటి కాలువ పనులను వేగవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రూ.103.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరదనీటి కాలువల నిర్మాణంపై ఎమ్మెల్యే సుధీర్రెడ్డి జలమండలి, ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ప్రాజెక్ట్ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరదనీటి కాలువల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసి టన్నెలింగ్ పనులను కూడా పూర్తి చేస్తే వరద ముంపు జరుగకుండా ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.
మన్సూరాబాద్, సరస్వతినగర్ కాలనీలో వరదకాలువ పనులు కూడా త్వరలోనే టెండర్ జరిగి పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రధాన మార్గాల్లో వరదనీటి కాలువ పనులు సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజినీర్ కిషన్, హయత్నగర్ ఉప కమిషనర్ మారుతీ దివాకర్, ఎల్బీనగర్ ఉప కమిషనర్ సురేందర్రెడ్డి, సరూర్నగర్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, ఎస్ఈ అశోక్రెడ్డి, ప్రాజెక్ట్ ఎస్ఈ రవీందర్ రాజు, ఈఈ కృష్ణయ్య, డీఈ రోహిణి, ఇరిగేషన్ డీఈ పవన్, జలమండలి జనరల్ మేనేజర్లు బలరాం రాజు, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.