రవీంద్రభారతి, జూన్ 22 : రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో జూలై 3న నిర్వహించ తలపెట్టిన రైతు ఉద్యమ మహా సభకు వేలాది మంది తరలి రావాలని రైతు నేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. సమాఖ్య కార్యాలయంలో రైతు ఉద్యమ మహా సభ ఏర్పాట్లపై రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి అధ్యక్షతన జిల్లాల రైతు సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు జాగృతం చేసేందుకు రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో జూలై 3న నిర్వహించే రైతు ఉద్యమ మహా సభకు రైతులు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు జున్నుతుల రాజిరెడ్డి, నాయకులు తులసి, లక్ష్మణ్, కర్ర గోపాల్ రెడ్డి, విజయరెడ్డి, కంకణాల జనార్దన్రెడ్డి, తాళ్లపెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.