గాజుల రామారం, జూన్ 5: బడుగులను ఏకం చేసిన బహుజన మహా నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డిలు అన్నారు. గాజుల రామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్లో స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న, కంఠ్లమయ్య (శ్రీకంఠ మహేశ్వర స్వామి) విగ్రహాలను ఆదివారం రాష్ర్ట ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు కేపీ వివేకానందలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన మహా నాయకుడు సర్వాయి పాపన్న అని వారు కొనియాడారు. పాపన్నను కేవలం గౌడ కులస్తుడిగానే చూడొద్దన్నారు. 366 సంవత్సరాల క్రితం జన్మించిన పాపన్న ఆ కాలంలోనే అన్ని కులాలను కలుపుకుని మొఘల్ రాజులతో పోరాడారని తెలిపారు. అనంతరం, మంత్రులు ఈత మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో బాబు గౌడ్, క్రిష్ణాగౌడ్, ఇందిరా గౌడ్, సత్యనారాయణ గౌడ్, బిక్షపతి గౌడ్, శివ కుమార్ గౌడ్, ముఖేష్ గౌడ్, వెంకన్న గౌడ్, విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.