ఉస్మానియా యూనివర్సి టీ, మే 23: రాష్ట్రం లో ఉన్నత విద్యలో సమీకృత విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు క్లస్టర్ విధానం తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పది అటానమస్ కళాశాలలను ఒకే గొడుగు కింద కు తెచ్చే ఈ విధానంపై అవగాహన ఒప్పందం కు దిరింది. ఈ మేరకు కళాశాలల యాజమాన్యాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఓయూ పరిపాలనా భవనంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీ న్ మిట్టల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొ.వెంకటరమణ సమక్షంలో ఈ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా ఆ కళాశాలల మధ్య ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక, అధ్యాపకుల పరస్పర సహకారం, వి ద్యార్థుల ఉమ్మడి పరిశోధన, విజ్ఞాన సహకారంతో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ కళాశాలల మధ్య ఉత్త మ బోధనా విధానాల మార్పిడికి ఈ ఒప్పందం దోహద పడుతుందని, దీంతో ఉత్తమ విద్యా విధా నం విద్యార్థులకు చేరవవుతుందని అభిప్రాయపడ్డారు. అటానమస్ కళాశాలలు ఒకే గొడుగు కింద కు రావడం దేశంలో ఇదే తొలిసారని చెప్పారు. ఒ ప్పందంపై మెహిదీపట్నం-ఎస్టీ ఆన్స్ మహిళా కళాశాల, సికింద్రాబాద్ లయోలా అకాడమీ, ఎస్టీ జో సెఫ్ డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్టీ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల, ఆర్బీవీఆర్ఆర్ కళాశాల, భవన్స్ న్యూసై న్స్ కళాశాల, నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, ప్రభుత్వ సిటీ కళాశాల, బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.