మేడ్చల్ రూరల్, మార్చి 23; శ్రీగంధ పరిమళం 44వ జాతీయ రహదారిపై గుబాళిస్తోంది. గుండ్ల పోచంపల్లి – కండ్లకోయ రింగు రోడ్డు కూడలి, రహదారిపై ఉన్న ఆక్సిజన్ పార్కుల్లో శ్రీ గంధం మొక్కలు దట్టంగా ఎదుగుతున్నాయి. అర్బన్ పార్కును దట్టమైన అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన శ్రీగంధం మొక్కల పెంపకం ఇందుకు మంచి ఫలితాన్నిస్తోంది. ఏడాది కిందట గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ ఆక్సిజన్ పార్కు నుంచి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జిల్లా అంతటా అర్బన్ పార్కులు, రిజర్వ్ ఫారెస్ట్లను విస్తరించారు. శ్రీగంధం మొక్కపై పొరుగు వృక్షాల నీడ పడ్డప్పటికీ ఇతర చెట్ల వేళ్ల ఆధారంగా ఇవి నిటారుగా ఎదుగుతున్నాయి. ఆకురాల్చే కాలంతో పాటు అన్ని కాలాల్లో శ్రీగంధం ఆకులు పచ్చగా ఉంటాయి. కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో దాదాపు 2500 మంది శ్రీగంధం మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్క బతికేందుకు డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు.