చర్లపల్లి, మే 23 : నేరాలను అదుపు చేసేందుకు కాలనీవాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని అణు ఇంధన సంస్థ ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అణుపురం కమ్యూనిటీ హాల్లో రూ.6లక్షలతో ఏర్పాటు చేసిన 41సీసీ కెమెరాలను ఆయన మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో నేరాలను జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా కాలనీ సంక్షేమ సంఘాలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
అదేవిధంగా అణుపురం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలో కాలనీలో డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేసిన అనంతరం రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం డీసీపీ రక్షితమూర్తి మాట్లాడుతూ నేరాలను అదుపు చేసేందుకు కాలనీ సంక్షేమ సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నామనారు. వివిధ పోలీస్స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తున్నామని, అనుమానితుల పట్ల జాగ్రత్తగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని ఆమె సూచించారు.
అనంతరం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్, కాలనీ సంక్షేమ సంఘం ఆధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎన్.వాసుదేవ్, రామకృష్ణారావులు ప్రసగించారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో వివిధ సెక్టార్లకు ఎస్సైలు సాయికుమార్, ఉపేందర్యాదవ్, మదన్లాల్, నాగర్జున, షఫీ, వేణుమాదవ్, భద్రయ్య, మాజీ కార్పొరేటర్ రామారావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మహిపాల్రెడ్డి, గిరిబాబు, నాయకులు సోమశేఖర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, బాల్రాజు, సుదర్శన్రెడ్డి, సీతారామిరెడ్డి, నాను, బాజీబాషా, యాకయ్య, రాజిరెడ్డి, రామాదేవి, శిరీషారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ విజయేందర్రెడ్డి, జైపాల్రెడ్డి, బలరామమూర్తి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలన
రామంతాపూర్,మే 23: హబ్సిగూడ డివిజన్ మహేశ్వరీనగర్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. డ్రైనేజీ కాలువలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని పక్కకు జరపాలని అధికారులను ఆదేశించారు.మూడు రోడ్ల కూడలిలో వరద ప్రవాహానికి అనుగుణంగా మలుపులు చే యాలని అధికారులకు సూచించారు. సాయిచిత్రానగర్ వాసులు ఎమ్మెలేను కలిసి వరద ముంపు నుంచి రక్షంచేలా ముందస్తుగా బాహుబలి మో టారును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ నాగేందర్,డీఈ నాగమణి,ఏఈ కీర్తి,డివిజన్ అధ్యక్షులు డాక్టర్ బివిచారి,కంచర్ల సోమిరెడ్డి,లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్రెడ్డి,జేసిబిరాజు,సూరంశంకర్, మైసయ్య, కాలనీ వాసులు అరవింద్రెడ్డి,మల్లయ్య, నాగేశ్,ఉపేందర్, నారాయణ్రెడ్డి,వెంకటేశం పాల్గొన్నారు.
బాక్స్ కల్వర్టు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
రామంతాపూర్,మే23:చిలుకానగర్ డివిజన్ పరిధి లోని ధర్మపురి కాలనీలో రూ. 49 లక్షలతో చేపట్టిన బాక్స్ కల్వర్టు పనులను సోమవారం ఎమ్మెల్యే సుభాష్రెడ్డి కార్పొరేటర్ గీతా ప్రవీణ్తో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో ఈఈ నాగేందర్,ఏఈ రాజ్కుమార్,టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్రావు,జగన్,నరేశ్, జగన్ , వెంకటేశ్వర్రెడ్డి,నారాయణ్రెడ్డి,శ్రీను,మహేందర్,అశోక్చారి,సుందర్,పోచయ్య,సదానందాచారి,సుధాకర్,బాలు,సుభద్ర,సరిత,షహనాజ్,fíలనీవాసులు మధుకర్రెడ్డి,మాణిక్ప్రభు,వేణుగోపాల్శర్మ ఉన్నారు.
మహిళలు స్వయం ఉపాధిని ఎంచుకోవడం అభినందనీయం
మల్లాపూర్, మే 23: నిరుద్యోగ మహిళలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిని ఎంచుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ వెంకటేశ్వరనగర్లో దళిత కల్యాణవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు రేణికుంట ఎల్లయ్య కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఎంజెల్స్ ఉమెన్స్ వరల్డ్, ఏటు జెడ్ హోల్ సెల్ క్లాత్ స్టోర్ను ఆయన సోమవారం మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్యలతో కలిసి ప్రారంభించారు.