చిక్కడపల్లి, మే 21: భాషపై పట్టు, ధారళంగా ఆశువుగా పద్యాలను చెప్పగల ప్రతిభ, ధారణ శక్తి కలగలిసిన అవధానం విద్యలో మేటి గరికపాటి నరసింహారావు అని తెలంగాణ ప్రభుత్వం సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి అ న్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్ నేషనల్ స్వర్ణోత్సవాల సందర్భంగా జాతీయ జీవిత సాఫల్య పురాస్కారంతో సత్కరించారు. శనివారం రాత్రి త్యాగరాయ గానసభలో కేవీ రమణాచారి చేతుల మీదుగా వంశీ – వేద ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఏపీ శాసన సభ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ హాజరై పురస్కారాన్ని అందించారు. వంశీ రామరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ తోటకూర ప్రసాద్, డా.నందివాడ అనంతలక్ష్మి, పద్మజ, డా.తెన్నేటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ, కన్వీనర్.ఆర్.ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.