కవాడిగూడ, మే 17: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని ఘంటసాల గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ముషీరాబాద్ సర్కిల్-15 డీఎంసీ హరికృష్ణతో కలిసి ప్రారంభించారు. క్రీడాకారులకు, స్పోర్ట్స్ కోచ్లకు క్రీడావస్తువులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించి రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ కావాల్సిన వస్తువులను సమకూరుస్తున్నారని అన్నారు. యువత ఆరోగ్యాంగా ఉండేందుకు వ్యాయామం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, టీఆర్ఎస్ నగర యువజన నాయకుడు ముఠా జయసింహ, ముఠా నరేష్, కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, రాకేష్ కుమార్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, బాక్సర్ కృష్ణ, వెంకటేశ్, హనుమంతు, రాజ్కుమార్, గడ్డమీది శ్రీనివాస్, జాంగీర్, శివకుమారి, తుడుం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.