సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : నూతన సంవత్సర వేడుకల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య విభాగాలు ఇచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సర్కారు నిర్ణయం మేరకు వేడుకలు జరుపుకోవాలని, వేడుకల నిర్వహణపై ఇప్పుడేమి చెప్పలేమన్నారు. మాస్క్ తప్పనిసరని, ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.