Book Fair | సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో బుక్ ఫెయిర్ నిర్వహించేందుకు వేదికలు దొరకని దుస్థితి ఉండేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తోడ్పాటుతో బుక్ ఫెయిర్ ఓ పండుగలా నిర్వహించగలిగామని చెప్పారు.
అతి ఖరీదైన ఎన్టీఆర్ స్టేడియం వంటి ప్రాంతాన్ని పుస్తక పండుగ కోసం ఉచితంగా అందించిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని వివరించారు. ఈ సారి బుక్ ఫెయిర్ ప్రాంగణా నికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టినట్టు తెలిపారు. అలాగే బుక్ ఫెయిర్ వేదికకు సంస్కృత పండితుడు, ద్రవిడ యూనివర్సిటీకి వీసీగా ఉన్న దివంగత రవ్వా శ్రీహరి పేరును నామకరణం చేసినట్టు చెప్పారు. ప్రారంభో త్సవం రోజున ప్రధాన వేదిక వద్ద అమర వీరుల స్థూపం ఏర్పాటు చేసి అమరులకు నివాళులర్పి స్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుక్ ఫెయిర్ నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తు న్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కొలువుదీరబోతున్న బుక్ ఫెయిర్లో 365 స్టాల్స్ ఉండబోతున్నాయి.
ఇందులో తెలుగు సాహిత్యానికి సంబంధించి 184 స్టాల్స్ ఉండగా, ఆంగ్ల సాహిత్యానికి 144 స్లాల్స్, పిల్లల కోసం 18 స్టాల్స్, ప్రభుత్వం సమాచార స్టాల్స్ 7, మీడియా రంగ సంస్థలు-15 స్టాల్స్తో పాటు ఇతర స్టాల్స్ ఉంటాయని హెచ్బీఎఫ్ సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ తెలిపారు. హెచ్బీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ కోయ చంద్రమోహన్, హెచ్బీ ఎఫ్ ఫౌండర్ రాజేశ్వర్రావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి వాసు, జాయింట్ సెక్రటరీ శోభన్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, కవి యాకూబ్, కార్యవర్గ సభ్యులు సూరిబాబు, శ్రీకాంత్, బాల్ రెడ్డి, మెంబర్ జనార్దన్ గుప్త తదితరులు పాల్గొన్నారు.