జవహర్నగర్, మే 16: భగవంతుడి దర్శనం కోసం గుడికి వెళ్లి వచ్చే సరికి ప్రమాదవశాత్తు ఇంట్లో షాట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతై ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన జవహర్నగర్ పో లీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండలం నాగపూరికి చెందిన శ్రీకాంత్ 20ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జవహర్నగర్లోని కార్మికనగర్లో భార్య దివ్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శ్రీకాంత్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం అమవాస్య కావడంతో ఉదయమే ఇంట్లో పూజ చేసుకుని… చీర్యాల్లోని దేవాలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.
ఈ క్రమంలోనే ఇంట్లోంచి పొ గలు వస్తున్నాయని స్థానికులు శ్రీకాంత్కు తెలియజేయగా, వెంటనే ఇంటికి వచ్చి చూసేలోపు పూర్తిగా కాలికిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీ సుకొచ్చారు. ఇంట్లో దాచుకున్న రూ.4 లక్షలు, 3తులాల బంగారు ఆభరణా లు మంటల్లో కాలిపోవడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న రూ. 4లక్షలు కాలిపోవడంతో కుటుంబసభ్యుల రోధనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సుమారు 12లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.