కొండాపూర్, మే 19 : పలు అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల విద్యాభ్యాసానికి హైటెక్సిటీలోని మై హోం నవద్వీప ఫౌండేషన్ ఆర్థిక సాయమందించింది. ఆదివారం ఆశ్రమ నిర్వాహకులకు ఫౌండేషన్ సభ్యులు రూ. 2,75,800ల చెక్లను అందజేశారు.
ఈ సందర్భంగా నవద్వీప ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ… పలు అనాథ ఆశ్రమాల్లో ఉంటున్న 30 మంది చిన్నారులకు ఈ విద్యా సంవత్సరానికి అవసరమైన స్కూల్ ఫీజుల కోసం ఆర్థిక సాయమందిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి సాయం చేస్తున్నామన్నామన్నారు.