సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.60 వరకు నీరు చేరింది. ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో ఏ క్షణంలోనైనా.. నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవచ్చు. ఆ వెంటనే గేట్లు ఎత్తుతామని జలమండలి అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. మూసీ, ఈసీ నదుల పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.