మాదాపూర్, సెప్టెంబర్ 8: మహిళలు ఎంతగానో మెచ్చే తీరొక్క డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో శుక్రవారం హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్ పో పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటీమణులు నందిత శ్వేత, ఆశురెడ్డి,
మిస్ సుప్ర నేషనల్ ఏసియా 2023 ప్రజ్ఞ అయ్యగారి విచ్చేసి ప్రముఖ మోడల్స్తో పాటు నిర్వాహకుడు డోమినిక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇందులో ప్రముఖ డిజైనర్లతో రూపొందించబడిన ప్రత్యేక డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. అనంతరం నటీమణులు, మోడల్స్ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.