కీసర, అక్టోబర్ 17: హరితహారంలో నాటిన చెట్లను నరికివేసిందుకు ఒక వ్యక్తికి జరిమానా విధించిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కీసర మండలం గోధుమకుంటలోని వీఎస్ఆర్ నగర్ కాలనీలో హరితహారం కింద నాటిన చెట్లను ఆ కాలనీకి చెందిన జె.శ్రీనివాస్ గౌడ్ నరికివేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి వెంటనే సదరు వ్యక్తికి రూ.20 వేల జరిమానా విధించారు. గ్రామ పంచాయతి నుంచి రూ.20 వేల ఫైన్ వేస్తూ రశీదును సిబ్బంది చేత అందజేశారు.