సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): నగరంలోని లులు మాల్లో గ్రాండ్ కేక్ మిక్సింగ్ కార్నివాల్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. అత్యుత్తమమైన భారీ కేక్ను తయారీ చేయడానికి జీడిపప్పు, ఎండుద్రాక్ష, టుట్టీ ఫ్రూటీ, క్యాండీడ్ చెర్రీస్, లైమ్పీల్, ఆరెంజ్పీల్, దిగుమతి చేసుకున్న ద్రాక్ష రసంతోపాటు మిక్స్డ్ నేచురల్ మసాలాతో సహా 3500 కిలోల డ్రైఫ్రూట్లను మిక్సింగ్లో చేర్చారు. దీంతో పాటు క్రిస్మస్ వేడుక కోసం 20కి పైగా రకరకాల ప్రత్యేక కేక్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మిక్సింగ్లో లులు గ్రూప్ తెలంగాణ రీజినల్ డైరెక్టర్ అబ్దుల్ సలీమ్, తెలంగాణ రీజినల్ మేనేజర్ అబ్దుల్ ఖదీర్ షేక్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.