Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.2 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.68లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో పెట్టి బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.