సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తనిఖీల్లో భాగంగా.. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రూ.13.75 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
రూ.కోటి 93 లక్షల విలువజేసే ఇతర వస్తువులు, 20,129.25 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు. 171 కేసులు నమోదు చేసి, 163 మందిని అరెస్టు చేశామన్నారు. నగదు, ఇతర వస్తువులపై 348 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్కరించామన్నారు. 227 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, 2711 లైసెన్స్ ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేశారని కమిషనర్ తెలిపారు. తాజాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో రూ 2.87 లక్షల నగదు, రూ.4.08 లక్షల విలువైన వస్తువులను పట్టుకొని, సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.