సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, గడిచిన మూడు నెలలుగా 439 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనధికార నిర్మాణాలు, లే అవుట్లను గుర్తించి పర్యవేక్షణ, చర్యలు తీసుకునేందుకు జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ ఆఫీస్ స్థాయిలో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
టౌన్ప్లానర్, న్యాక్ ఇంజినీర్ ద్వారా స్పెషల్ టాస్క్ఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఆన్లైన్లో అనుమతి పొందిన ప్రతి అనుమతిపై నిఘా ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సంబంధిత నిర్మాణాదారుడికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.