జనవరి నుంచి ఇప్పటి దాకా 73,751 ఫిర్యాదుల పరిష్కారం
కొవిడ్ దరిమిలా ఆన్లైన్ ఫిర్యాదులపై బల్దియా దృష్టి
సిటీబ్యూరో, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): కొవిడ్ దరిమిలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సందర్శకులపై పాక్షిక ఆంక్షలు అమలవుతున్నందున బల్దియా అధికారులు ఆన్లైన్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానం గా ఎనిమిది విధాలుగా ప్రజల నుంచి స్వీకరిస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి ఇప్ప టి దాకా అందిన ఫిర్యాదులలో ఏకంగా 81 శాతం మేర ఫిర్యాదులను పరిష్కరించడం విశేషం. సమస్య పరిష్కా రం తర్వాత ఫిర్యాదుదారుడు తన గ్రీవెన్స్ను మూసివేస్తేనే సమస్య పరిష్కారంగా అధికారులు పరిగణిస్తున్నారు. లేనట్లయితే వాటిని పెం డింగ్ ఫిర్యాదుల జాబితాలో చూపిస్తున్నారు.
‘మైజీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్సైట్, జీహెచ్ఎంసీ కాల్సెంటర్, డయల్ 100, ఎమర్జెన్సీ కాల్ సెంటర్, జీ హెచ్ఎంసీ ట్విట్టర్, ప్రజావాణి, వార్త పత్రికల క్లిపింగ్స్, కమిషనర్ పేషీ’ ద్వారా అందే ఫిర్యాదులు ప్రధానంగా ఉన్నాయి. దీనికి తోడు నగరంలో ఏర్పడ్డ కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా కొవిడ్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. అయితే, పౌరుల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంలో మరింత పారదర్శకత ఉండేలా సం బంధిత ఫిర్యాదుదారుడే తన ఫిర్యాదు పరిష్కారంపై సంతృప్తిని పొంది, గ్రీవెన్స్ను మూసివేయాల్సి ఉంటుం ది. జీహెచ్ఎంసీకి ఈ ఏడాది జనవరి నుంచి మంగళవారం వరకు 91,530 ఫిర్యాదులందాయి. వీటిలో 73,751 ఫిర్యాదులను పరిష్కరించారు. ప్రధానంగా ఫిర్యాదుదారులు తమ సమస్యలు పరిష్కారమైనట్లుగా గ్రీవెన్స్ను మూసివేస్తారు. అయితే, దీర్ఘకాలిక పనులు, వివిధ శాఖలతో ముడిపడి ఉన్న పనులు, పెద్ద ఎత్తున నిధులు అవసరమయ్యే 17వేలకు పైగా ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయి.
జీహెచ్ఎంసీలోని కొవిడ్ కంట్రోల్ రూంకు సంబం ధిత అంశాలపైనే అధికంగా ఫిర్యాదులు అందుతున్నా యి. ఈ నెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 563 ఫిర్యాదులందాయి. వీటిలో 133 కిట్లు, 292 కా ల్స్ వాక్సినేషన్, పరీక్షా కేంద్రాలకు సంబంధించినవి.