Hyderabad
- Dec 06, 2020 , 06:04:41
కరోనా లక్షణాలుంటే పరీక్ష చేయించుకోండి

- హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: ఎవరికైనా కరోనా లక్షణాలున్నా, వైరస్ సోకిందనే అనుమానాలున్నా వెంటనే నగరంలోని ప్రతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు కింగ్కోఠి, నల్లకుంట ఫీవర్,ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాల, నిమ్స్ తదితర దవాఖానల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి ప్రజలకు సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాస్కులు లేకుండా బయటకు రావద్దని, సాధ్యమైనంత వరకు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఉత్తమమన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సహజంగానే ఫ్లూ వంటి వైరస్లు విజృంభిస్తుంటాయని,ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డా.వెంకటి సూచించారు.
తాజావార్తలు
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్క్రీమ్లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు
- మహారాష్ట్రలో బర్డ్ఫ్లూ కలకలం
MOST READ
TRENDING