ఖైరతాబాద్, ఆగస్టు 19 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని జై గణేశ భక్తి సమితి పిలుపునిచ్చింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.జైన్ కుమార్ చారి సమితి నూతన కమిటీని ప్రకటించారు. చైర్మన్గా ఎ. ఈశ్వర్ ప్రసాద్, వైస్ చైర్మన్గా నవీన్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఎం. కుమార్ సాగర్, ముఖ్య సలహాదారులుగా జ్ఞానేంద్ర, శారదాదేవి, సలహాదారులుగా వి. శ్రీకాంత్, ఎస్.సంజీవ్ చారి, వేములవాడ మధన్ మోహన్చారి, ఉపాధ్యక్షులుగా బి. భువనేశ్వరి దేవి, కె. మహేశ్ చారి, బి. రాజేశ్, ఎ.నాగరాజు, ఎర్ర జ్యోతి, బిరాదర్ మహేందర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా శరత్చంద్ర, తదితరులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన చైర్మన్ ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సమితి ఆధ్వర్యంలో గత పదేండ్లుగా మట్టి గణపతులను ప్రోత్సహిస్తూ వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వినాయక చవితికి మట్టి గణపతులను ఏర్పాటు చేయాలని కోరారు.