హైదరాబాద్ : నగరంలోని ఇనార్బిట్మాల్లో ఉచిత వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహించనున్నారు. 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లలకు ఉచితంగా కొవిడ్ టీకాను అందజేయనున్నట్లు ఇనార్బిట్ మాల్ నిర్వాహకులు తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకా వేయనున్నారు.
ఈ సందర్భంగా ఇనార్బిట్ మాల్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి మాట్లాడుతూ.. మా మాల్కు వచ్చే టీనేజర్లందరికీ ఉచితంగా టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు విధిగా టీకాలు ఇప్పించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకుని సురక్షితంగా ఉండాలన్నారు. ఇనార్బిట్ మాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వ్యాక్సిన్ తీసుకోదలచిన వారు.. తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాల్లోనే 30 నిమిషాల పాటు ఉండాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లొచ్చని శరత్ బెలవాడి స్పష్టం చేశారు.