కాచిగూడ, ఏప్రిల్ 20: హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆధునిక పరికరాలతో విజయ డయగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా నల్లకుంట మెయిన్ రోడ్డు పోస్టాఫీస్ పక్కన పక్షవాతానికి సంబంధించిన వైద్యాన్ని హ్యుమానిటీ హెల్త్సెంటర్లో ఉచితంగా అందిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కొండ శ్రీనివాస్రావు తెలిపారు. పక్షవాతంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9949238492లో సంప్రదించాలన్నారు.
ఏఎంఎస్ కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో లిఫ్ట్ ఏర్పాటుకు రిటైర్డ్ టీచర్ కేతవరపు సుబ్రహ్మణ్యం బుధవారం కాలేజీ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎం.సులోచనకు రూ.5లక్షల విరాళాన్ని అందజేశారు. విద్యార్థులకు ఇబ్బందిగా ఉండటంతో వారి సౌకర్యార్థం లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు ఈ విరాళాన్ని ఇచ్చారని చైర్పర్సన్ తెలిపారు. – అంబర్పేట, ఏప్రిల్ 20