మారేడ్పల్లి, డిసెంబర్ 17: అయప్ప స్వామి మాలధారణ ఎంతో పవిత్రమైందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్ లోని కీస్ హైస్కూల్ లో శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అయప్ప స్వామి మహాపడి పూజ లో ఆయన పాల్గొన్నారు.
సామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, వెంకట నారాయణ, రాజు, చంద్ర, శ్రీను, శివ నారాయణ పాల్గొన్నారు.