గౌతంనగర్, డిసెంబర్ 27 : మౌలాలి డివిజన్ పరిధి, పిల్లినర్సింగ్రావు(సీపీఎం బస్తీ)లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు మౌలిక సదుపాయాలులేక, అభివృద్ధికి నోచుకోక బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో ఈ బస్తీ అభివృద్ధిపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక దృష్టి సారించి.. వివిధ శాఖలను నుంచి నిధులను మంజూరు చేయించారు. దీంతో ఇప్పుడు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ .2కోట్ల వ్యయంతో విద్యుత్ పోల్స్, భూగర్భడ్రైనేజీ, నీటి సరఫరా పైపులైన్ల పనులు పూర్తిచేసి బస్తీలో అంతర్గత రోడ్లు, ప్రధాన మార్గంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు.
రూ.2కోట్ల వరకు అభివృద్ధి పనులు
పిల్లినర్సింగ్రావు కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి.. దానిపై ప్రత్యేక దృష్టి సారించి దశలవారీగా రూ.2కోట్ల వరకు వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యుత్ పోల్స్, వాటర్ సరఫరా పైపులైన్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసి సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాం. రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతూ.. అభివృద్ధి పనులు చేపడుతున్నాం. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైనా తీసుకువస్తాం.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే