ఆర్కేపురం, మార్చి 5 : మహిళా దినోత్సవంనాడు కాకుండా ప్రతిరోజూ మహిళలని గౌరవించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట వాసవి కాలనీలోని కిన్నెర గ్రాండ్ హోటల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు, అమ్మాయిలలో ధైర్యం నింపేందుకు షీ-టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు, దేశానికి, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించటమే కాకుండా జీహెచ్ఎంసీలో అదనంగా మరో పది సీట్లు కేటాయించారని తెలిపారు. మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ ఒక మొక్క నాటాలని కోరారు. పిల్లలను పెంచిన తల్లులకు మొక్కలు నాటి పెంచడం కష్టమేమి కాదన్నారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా మాట్లాడుతూ మహిళలకు భూదేవి అంత ఓపిక ఉంటుందన్నారు. తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్, యాంకర్ రవి, బిగ్బాస్ ఫేమ్ హిమాజారెడ్డి, ఐవీఎఫ్ మహిళా విభాగం పథమ మహిళ ఉప్పల స్వప్న తదితరులు పాల్గొన్నారు.
రూ. 2 కోట్లతో సేవాలాల్ దేవాలయం
బడంగ్పేట, మార్చి 5 : బంజారాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలానగర్ కాలనీలో జరిగిన సేవాలాల్ మహరాజ్ జయంతికి ఆమె ముఖ్యఅతిథిగా హజరై నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడినట్లు చెప్పారు. బంజారాహిల్స్లో బంజారా భవనం నిర్మించినట్లు, గుర్రంగూడ లెనిన్నగర్లో రూ. 2 కోట్లతో సేవాలాల్ మహరాజ్ దేవాలయం నిర్మించనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, నందు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రవినాయక్, శ్రీను నాయక్, చవాన్,రామునాయక్, తదితరులు ఉన్నారు.