చార్మినార్, మార్చి 5 : నగర పోలీస్ విభాగంలో మొదటి సారిగా ప్రజలను భాగస్వాములను చేస్తూ కుస్తీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉన్నదని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దక్షిణ మండల పోలీసుల ఆధ్వర్యంలో కులీకుతుబ్షా మైదానంలో నిర్వహించిన కొత్వాల్ కేసరి కుస్తీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి సీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కుస్తీ పోటీల్లో మొత్తం 254 మంది పాల్గొనగా అందులో 14 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.
అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన మల్ల యోధులకు 8 లక్షల అవార్డుతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రంసింగ్మాన్, జాయింట్ సీపీ శ్రీనివాసులు, దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య, సౌత్ఈస్ట్ డీసీపీ రూపేశ్, హైదరాబాద్ నార్కోటిక్ డీసీపీ సునితారెడ్డి, టాస్క్ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి, చార్మినర్ ఏసీపీ రుద్రభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.