సుల్తాన్బజార్, జనవరి 8: రెజ్లింగ్ క్రీడ ఎంతో ప్రాచీనమైందని,అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఒలింపిక్స్ పోటీలలో అత్యధిక పతకాలను రెజ్లింగ్ క్రీడలలోనే వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన 51వ సీనియర్ నేషనల్ ఇండియన్ ైస్టెల్ రెజ్లింగ్ అసోసియేషన్ హింద్ కేసరి టైటిల్ పురుషుల, మహిళల చాంపియన్ షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రెజ్లింగ్కు పూర్వ వైభవం తీసుకు వస్తామని, హైదరాబాద్లో రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్రీడా మైదానాలలో రెజ్లింగ్ కోర్టులు ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తామన్నారు. తెలంగాణను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. విజయ్కుమార్ గౌరవార్థం జరుగుతున్న రెజ్లింగ్ పోటీలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. రెజ్లింగ్ అంటే బలమే కాదని తెలివి, సాంకేతికత, వేగాన్ని సమయానుసారంగా ప్రదర్శించే క్రీడ అని అన్నారు. క్రీడాకారులను సీఎం కేసీఆర్ ఎల్లవేళలా ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. కుస్తీ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీనిచ్చారు. రెజ్లింగ్ క్రీడ లలో పురుషులతో సమానంగా మహిళ లు రాణించడం అభినందనీయమని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రభుత్వం తరఫున పోటీలలో విజేతగా నిలిచిన క్రీడాకారునికి లక్ష రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మసిఉలా ్లఖాన్, మాజీ రాష్ట్ర సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్యాదవ్, జాంబాగ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం ఆనంద్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.