మియాపూర్, అక్టోబరు ౧౩ : “నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే” సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బోనాంజా డ్రా నగరంలో సందడిగా కొనసాగుతున్నది. ఈ నెల ౯ నుంచి ౧౮ వ తేదీ వరకు నగరంలోని వివిధ భాగస్వాముల అవుట్లెట్లలో డ్రా తీసే కార్యక్రమం కొనసాగుతున్నది.
ఇందులో భాగంగా నాలుగో డ్రా కూకట్పల్లి ‘ది చెన్నై షాపింగ్ మాల్’లో శుక్రవారం తీశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ సీజీఎం శ్రీనివాస్, జీఎం సురేందర్రావు, ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు, మేనేజర్ సందీప్ జోషి, ది చెన్నై షాపింగ్ మాల్స్ ఇన్చార్జి నవీన్కుమార్శర్మ, వా యాడ్స్ ఎండీ వెంకట్రామ్, తదితరులు పాల్గొన్నారు.