కొత్తూరు, జూలై 18 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జేపీ దర్గాను రక్షించాలంటే మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని శనివారం డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ చేపట్టిన చలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం సర్కార్ తీసుకొచ్చిన 641 జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతులు, నాయకులు చేపట్టిన చలో కలెక్టరేట్ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఉదయం నుంచే పలువురు నాయకులను అరెస్టు చేసి కొత్తూరు ఠాణాకు తరలించారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా జేపీ దర్గాకు తరలివచ్చి సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే శంకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్కు తరలివెళ్లారు. డీసీపీ శిరీష ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ నిలువరించారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు ప్రభాకర్, శేఖర్రెడ్డి, జగన్, దేవేందర్, నవీన్చారి, శ్యాంసుందర్రెడ్డి, సురేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.