హైదరాబాద్ : హైదరాబాద్ సంయుక్త పోలీసు కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పకుండా నిర్వహిస్తామని మందుబాబులను హెచ్చరించారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.