పేదల చిరకాల కోరిక గూడు.. దీనిని పేదలకు ఉచితంగా అందించేందుకు నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా దిగ్విజయంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించి ఇస్తున్నారు. పేదల కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్నా, అనుకున్న విధంగా సర్కార్కు ఎంత కష్టమొచ్చినా వెను దిరగకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
కంటోన్మెంట్లోని రసూల్పురా
కట్టమైసమ్మ సిల్వర్ కంపౌండ్లో రూ. 14 కోట్లతో 168 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఇదే ప్రాంతంలో మరో 56 ఇండ్ల నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్లతో కలిసి ఎమ్మెల్యే సాయన్న డబుల్ ఇండ్లను ప్రారంభించనున్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాంగానే రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో మొదటి దశలో భాగంగా సుమారు 168 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అదేవిధంగా మరో 56 ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిల్వర్ కంపౌండ్లోని రెండు పడకల గదుల నిర్మాణంలో హాల్, వంట గది, అటాచ్ బాత్ రూమ్లతో సుందరంగా ఉన్నాయి. అంతర్గత రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. రంగులతో సహ అన్ని పనులు పూర్తయ్యాయి. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు.
ఇళ్లు లేని పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అధికారులు పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి నివేదికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో డబుల్బెడ్రూం ఇండ్లను అర్హుల జాబితా ప్రకారం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో ఆరు బ్లాక్లలో కలిపి 168 ఇండ్లు పూర్తయ్యాయి. సుమారు రూ.14కోట్ల వ్యయంతో నిర్మించిన 168 ఇండ్లు ప్రారంభానికి సిద్ధం కావడంతో లబ్ధిదారుల్లో అనందోత్సహాలు వెల్లువిరిస్తున్నాయి.
ఇల్లులేని పేదలకు సొంతింటి కల సాకారం తమ నియోజకవర్గంలో మొదటి దశలో భాగంగా ఇండ్లు నిర్మాణాలు పూర్తిచేసుకోవడం సంతోషకరం. ఈ ప్రాంతంలోని లబ్ధిదారులకు అధికారులు డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించారు. నేడు ప్రారంభానికి సిద్ధం కావడంతో అర్హుల జాబితాలో ఎంపికైన పేదలు సొంతింట్లోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాకుండా కంటోన్మెంట్లోని మారేడ్పల్లిలో డబుల్ ఇండ్లు పూర్తికాగా, సిల్వర్ కంపౌండ్లోని మరో 56 ఇండ్ల నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తికాగానే త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లను అందజేస్తాం. s – జి. సాయన్న, ఎమ్మెల్యే,
కంటోన్మెంట్