రవీంద్రభారతి, మార్చి 18: జీవితం చాలా విలువైనది.. చిన్న కారణాలతో జీవితాలను మధ్యలో వదిలివేయొద్దని, తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగుల్చవద్దని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘స్పందన ఇ దా ఫౌండేషన్’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామల్ రెడ్డి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘జీవితం చాలా విలువైనది’ అనే అంశంపై అవగా హన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురై క్షణికావేశంతో తమ విలువైన జీవితాన్ని ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇది తగదని, ఏ సమస్య ఉన్నా మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయం సాధించాలే తప్ప, ఆత్మహత్యలు చేసుకోవడం సబబు కాదని ఆయన హితవు పలికారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఇది మొద ట పిల్లలకు అవగాహన సదస్సు కాదని, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు జీవితంపై అవగాహన కల్పించాలన్నారు.
విద్యార్థులను చదువు పేరుతో మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని, వారి ఎదుగుదలకు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన చెప్పారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడ లు, వ్యాయామం అవసరమని, దీంతో వారిలో మానసిక ఉల్లాసంతో ఉత్సాహం పెరిగి వారు ఎంచుకున్న గమ్యాలకు చేరుకుంటారన్నారు. క్షణికావేశంలో బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సావిత్రీబాయి ఫౌండేషన్ అధ్యక్షురా లు మాధవితో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ సలహాదారులు కేవీ రమణాచారి, శ్రీధర్బాబు, డా॥ కళ్యాణ్ చక్రవర్తి, టి.ఉ షాగిరి, డా॥ ఎస్హెచ్ కులకర్ణి, కృష్ణ భరత్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థుల ప్రదర్శనలు సభికులను ఉత్తేజితుల్ని చేశాయి.