మహేశ్వరం, జూన్ 7: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో 65 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, తాసీల్దార్ మహమూద్ అలీ, ఎంపీడీవో నర్సింహులు, జడ్పీటీసీ జంగారెడ్డి, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, నాయకులు కూన యాదయ్య, కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, ఎంఏ సమీర్, కె.మనోహర్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, అంబయ్య యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్లు కడమోని ప్రభాకర్, పొల్కం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
నీటి దినోత్సవంలో..
మహేశ్వరం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన నీటి దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మహేశ్వరం, కందుకూరు సహకార బ్యాంక్ చైర్మన్లు మంచె పాండు యాదవ్, చంద్రశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, ఎంపీడీవో నర్సింహులు, తాసీల్దార్ మహమూద్ అలీ, డీఈ దూదియా, ఏఈలు హబీబుద్దీన్, గంగరాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి మర్యాద రాఘవేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మద్ది కరుణాకర్రెడ్డి, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, సేవాలాల్ దేవాలయ చైర్మన్ సీతారాం చౌహన్, బీసీసెల్ అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, ఎస్టీసెల్ అధ్యక్షుడు గోపాల్నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుసగల్ల జంగయ్య, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, నవీన్ వివిద గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొనారు.