అమీర్పేట్ : సనత్నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ కాలుకు శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. నిరుపేద కుటుంబం కావడంతో గోపాల్కు చికిత్సచేయించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్ రెడ్డి ని కలిశాడు. కార్పొరేటర్ చొరవ తీసుకుని ఈ విషయాన్ని మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుకు స్పందించిన మంత్రి గోపాల్ శస్త్రచికిత్సకు అవసకరమైన రూ. 1 లక్షను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్వోసీ మంజూరు చేయించారు. అదేవిధంగా మారేడ్పల్లికి చెందిన సంజయ్ శస్త్రచికిత్సకు అవసరమైన రూ. 2 లక్షలను ఎల్వోసీ వచ్చేలా చొరవ తీసుకున్నారు.
ఈ సందర్భంగా లబ్దిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందేలా చేసిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.