ఘట్కేసర్, డిసెంబర్ 18 : పోచారం మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలు, మినీ ఫంక్షన్ హల్ వేలం నిర్వహించాలని పోచారం మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయించింది. సోమవారం చైర్మన్ బి.కొండల్రెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో నిర్మించిన 9 మడిగెలను, లక్ష్మినర్సింహా కాలనీలో ఏర్పాటు చేసిన మినీ ఫంక్షన్ హల్కు వేలం నిర్వహించి మున్సిపాలిటీ రాబడిని పెంచుకోవాలని నిర్ణయించారు.
యంనంపేట్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 23న ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ అవసరాల కోసం కొత్త ట్రాక్టర్, స్వచ్ఛ ఆటోల కొనుగోలుపై చర్చించారు. సమావేశంలో కమిషనర్ వేమనరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్, కౌన్సిలర్లు, కోఆష్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.