హైదరాబాద్ : సనత్నగర్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభించనున్నారు. చుట్టు పక్కల బిల్డింగ్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో కూల్చివేయనున్నారు. డైమండ్ కటింగ్తో ఒకేసారి భవనం కూప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం ఈ యంత్రం ప్రత్యేకత.
కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుదవారం టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. తొలుత భవనం చుట్టూ 125 మైక్రాన్ మందంతో ప్లాస్టిక్ షీట్ ఏర్పాటుకు రూ. 26 వేలు, కూల్చివేత సామాగ్రికి దాదాపు రూ. 11 లక్షలు, 20 కిలోమీటర్ల దూరానికి వ్యర్థాల తరలింపునకు రూ. 22 లక్షలు కలిపి మొత్తం రూ.33.86 లక్ష అంచనా టెండర్ను పిలవగా, నగరానికి చెందిన రూ. 25. 94 లక్షలకు ఎస్కె మల్లు అనే ఎజెన్సీకి ఈ పనులను అప్పగించారు. వారం నుంచి పది రోజుల రోజుల పాటు డెక్కన్ మాల్ భవనాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.